Description
“ఆచార్య ఆత్రేయ”గా పేరుగాంచిన “శ్రీ కిళాంబి వెంకట నరసింహాచార్యులు” మనందరికీ “మనసు కవి”గా “మన సుకవి”గా సుపరిచితులే. ఈయన గురించి తెలియని తెలుగు వాడుండడు. ఈయన తెలుగు సినీ ప్రపంచానికి గణనీయమైన కృషి చేసారు. వీరు మహారాష్ట్రలో జరిగిన అనేక సాహితీ సభలలో కూడా మరాఠి భాషలో ప్రసంగించారు. వీరికి తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మరాఠిలలో ప్రావీణ్యం ఉంది. వీరు అనేక సినీ గేయ రచనలే కాక పలు నాటికలు, కథలు, నాటకాలు రచన చేసారు. తమ సాహిత్యం ద్వారా, భారతదేశ స్వతంత్ర పోరాటంలో భాగస్వాములు అయ్యారు. క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొని చరసాల పాలయ్యారు.




